

పార్లమెంట్ లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వాన్ని, గిరిజన శాఖ మంత్రిని కోరిన ఎంపీ డికె.అరుణ.
- పార్లమెంట్ లో పాలమూరు ఎంపీ డికె.అరుణ తనదైనమార్క్
- పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించిన ఎంపీ డికె అరుణ
- ఎపి, తెలంగాణలోని బోయ వాల్మీకి వర్గాల చిరకాల డిమాండ్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన డికె.అరుణ
- బోయ వాల్మీకిలు నేటికీ ఆర్థికంగా, విద్యా పరంగా, సామాజికంగా చాలా వెనకబడి ఉన్నారు
- పూర్వం బోయ వాల్మికులు జీవనోపాధి కోసం వేటకు వెళ్ళేవారు
- వారికి ఎలాంటి కులవృత్తి లేక.. ఎవరు పట్టించుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- బోయ వాల్మీకి లు పక్కనున్న కర్ణాటక తో పాటు అనేక రాష్ట్రాల్లో sc లుగా, ఎస్ట్ లుగా గుర్తింపు పొందుతున్నారు
- కానీ తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లోని బోయ వాల్మీకి లు ఇంకా వెనకబడిన తరగతులుగా నే కొనసాగుతున్నారు
- త్వాద్వారా ఈ బోయ వాల్మీకి వర్గం ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
- తెలంగాణ మొత్తం కలిసి 5 లక్షల మందికిపైగా బోయ వాల్మీకి సామాజికవర్గ ప్రజలు ఉన్నారు
- తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే బోయ వాల్మీకి లు ఎక్కువగా ఉన్నారు
*చెల్లప్ప కమిటీ సిఫార్సులకు ఆమోదం*
- బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారి చిరకాల కోరిక
- ఈ ప్రతిపాదనలను గుర్తించి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం చెళ్ళ్ళప్ప కమిటీ నీ వేసింది
- ఆ చెళ్లప్ప కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా
- రామాయణం రాసిన వాల్మీకి మహర్షి వారసులుగా ఉన్న వీరందరికీ న్యాయం చేయాలి
- నవభారత నిర్మాణంలో సాధికారత, సమ్మతం సాధించాలంటే ఈ బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
- కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి - అని DK అరుణమ్మ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నాయకురాలు, MP DK అరుణమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు.